PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం సహాయ నిధి కి రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం 8 లక్షల రూ. సాయం

1 min read

అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో గత రెండు మాసాలలో భారీ వర్షాలు, తుఫాను, వరదలతో రాష్ట్రం హఠాకుతలమైందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఆపదలో ఉన్న తోటి వారికి సహాయం చేయటం మన మానవ ధర్మం, దానిలో భాగంగా మేము సైతం అంటూ వరద బాధితులకు దస్తావేజు లేఖరుల సాయం చేద్దామని రాష్ట్ర దస్తా వేజుల లేఖర్ల సంఘం ముందుకు వచ్చింది, రాష్ట్ర సంఘం తరపున 8 లక్షల రూపాయలు నిధులు సమీకరించారు,ఈ 8 లక్షల రూపాయలను చెక్కు రూపం లో  దస్తావేజుల లేఖర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి వి సుబ్బారావు ,స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎం సీతాపతి రావు ,రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు,ట్రెజరర్ అవ్వారు సత్యనారాయణ,స్టీరింగ్ కమిటీ మెంబర్ బి జె ప్రసాదరావు,ఆర్గనైజింగ్ సెక్రటరీ జి రవికుమార్,రమణ  నేతృత్వం లో శుక్రవారం అమరావతి లో నేరుగా ముఖ్య మంత్రి చంద్రబాబు కు అందజేశారు. మానవతా దృక్పథంతో ఆలోచింపజేసిన రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం నాయకులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *