NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా పాలన సాగుతుంది

1 min read

మంత్రి శ్రీ టిజి భరత్

శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

కర్నూలు, న్యూస్​ నేడు:  పెనుగంచిప్రోలు మండలం, తోటచర్ల గ్రామంలో మండల, గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టిజి భరత్ , శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)  పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు._ఈ సందర్భంగా మంత్రి టిజి భరత్  మాట్లాడుతూ ప్రజల ఆశయాల మేరకు ఏర్పాటుైన తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు గడిచిన ఈ కొద్ది కాలంలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  మార్గదర్శకత్వంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా పాలన సాగుతోంది. రైతులకు ఉచిత విద్యుత్, పెన్షన్ల పెంపు, మహిళల డ్వాక్రా రుణ మాఫీ, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం” అని అన్నారు.

అలాగే,శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య  మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే సుపరిపాలన సాధ్యమవుతుంది. అందుకే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకొని మరింత ప్రజా అనుకూల పాలనకు అంకితమవుతాం. తోటచర్ల గ్రామ ప్రజలు చూపిన ఆదరణకు కృతజ్ఞతలు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, తోట చర్ల మాజీ సర్పంచ్ వేముల సైదేశ్వర రావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేముల వెంకటేశ్వరరావు (V.V), క్లస్టర్ చుంచు రమేష్ మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author