PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ చల్లా పార్థసారథి కి ఘన సన్మానం

1 min read

ఉద్యోగుల  సమస్యల  పరిష్కారానికి ఏపీ ఎన్జీవోస్ అతి పెద్ద సంఘం

ఏపీఎన్జీవోస్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి  శ్రీనివాస్

దివ్యాంగుల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక

సంఘ సభ్యులకు, ఫెడరేషన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా

అధ్యక్షులు చల్లా పార్థసారథి

అభినందించిన ఉమ్మడి  పశ్చిమగోదావరి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం పిహెచ్ సి లో పనిచేస్తున్న మల్టీపర్పస్  హెల్త్ సూపర్వైజర్ చల్లా పార్థసారథి ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఏకగిరివంగా ఎన్నికైన శుభ సందర్భంగా ఆర్ఆర్ పేట జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం భవనంలో మంగళవారం సన్మాన కార్యక్రమాన్ని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏలూరు & ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా (ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అనుబంధం) అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని చల్లాపారసారికి పూల బొకేలు, అందించి శాలువాలు కప్పి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షలు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల సంఘ సమస్యల పరిష్కారానికి మార్గం చూపే అతిపెద్ద సంఘం ఏపీఎన్జీవోస్ అని నిరంతరం అన్ని శాఖల ఉద్యోగులకు, విశ్రాంత మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెన్నంటి ఉండి పలు పోరాటాల పరిష్కార మార్గ దిశగా పనిచేస్తుందన్నారు. కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్ నేరుసు రామారావు, పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జి శ్రీధర్ రాజు, జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు కప్పల సత్యనారాయణ, ఏలూరు తాలూకా ప్రెసిడెంట్ రవికుమార్ మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుండి ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, ఎంపీహెచ్వోలు తదితరులు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *