PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యం షాపులకు ముగిసిన గడువు..

1 min read

మొత్తం 172 దరఖాస్తులు:సీఐ రామాంజనేయులు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మద్యం షాపులకు మొత్తం 172 దరఖాస్తులు వచ్చినట్లు నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఎస్ రామాంజనేయులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్న రాత్రి 7 గంటలతో ముగిసిందని ఆయన తెలిపారు.నందికొట్కూరు,పగిడ్యాల,మిడుతూరు, జూపాడుబంగ్లా మండలంలో ప్రభుత్వం ప్రకటించిన (10) మద్యము దుకాణాలకు నిన్న సాయంత్రం వరకు వచ్చిన దరఖాస్తువివరాలు. నందికొట్కూరు పట్టణంలో నాలుగు షాపులకు గాను 68 దరఖాస్తులు,నందికొట్కూరు రూరల్ రెండు షాపులకు 20 దరఖాస్తులు,జూపాడుబంగ్లాకు:50,మిడుతూరు(షాప్-32):12, మిడుతూరు (షాప్-33):13,పగిడ్యాల:9 వచ్చాయని ఆయన తెలిపారు.ఈనెల 14వ తేదీన నంద్యాల వైయస్సార్ సెంటినరీ మీటింగ్ హాల్ నందు లాటరీ తీయడం జరుగుతుందని సీఐ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *