PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలకు మహర్దశ : ఎమ్మెల్యే పార్థసారథి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గ్రామాలకు మహర్దశ ఏర్పడిందని  ఎమ్మెల్యే డా .పార్థసారధి  అన్నారు.సోమవారం ఆదోని మండల పరిధిలోని బైచిగేరి గ్రామంలో “పల్లె పండగ వారోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గ్రామ సభలో  పాల్గొని మాట్లాడారు.  అంతకుముందు గ్రామం మొత్తం వీధి వీధినా తిరిగి ప్రతి ఇంటి దగ్గరకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.  అనంతరం అధికారులతో కలిసి గ్రామసభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఈరోజు బైచిగిరి గ్రామంలో  జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కింద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానంతో, ఉపముఖ్యమంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కృషితో ఈ ఐదు సంవత్సరాల కాలంలోగ్రామాల్లో అభివృద్ధి పరుగులు పట్టిస్తామని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.    గ్రామాల అభివృద్ధికికూటమి నాయకులంతా కూడా కలిసి సహకరిస్తారని అన్నారు. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో అభివృద్ధికి ఇక అడ్డు లేకుండా చక చకా గ్రామ అభివృద్ధి పనులు ముందుకు వెళ్తాయని ఎమ్మెల్యే అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *