PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడుమూర్ లో సీసీ రోడ్లకు భూమి పూజ..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో సోమవారం ఉదయం 10:30 కు ‘పల్లె పండుగ..పంచాయితీ వారోత్సవాలు’కార్యక్రమంలో భాగంగా సిమెంట్ రహదారులకు అధికారులు భూమి పూజ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో 10 లక్షలు మరియు మైనార్టీ కాలనీలో 15 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరు అయిన 2 సిమెంట్ రోడ్లకు మిడుతూరు ఎంపీడీఓ పి దశరథ రామయ్య, మరియు గ్రామ నాయకులు టెంకాయలు కొట్టి భూమి పూజ చేశారు.గత ఆగస్టు నెల 23వ తేదీన గ్రామసభలో ఈ రోడ్లకు తీర్మానం చేయడం జరిగింది ఈ పనులకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కావడంతో ఈ రోడ్లకు నిన్న భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ సంజన్న,పిఆర్ ఏఈ ప్రతాప్ రెడ్డి,ఏపీఓ జయంతి, గ్రామ నాయకులు సుధాకర్ రెడ్డి,సల్కోటి గోవర్ధన్ రెడ్డి,ఇద్రిస్,మగ్బుల్ అహ్మద్,ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి శివ కళ్యాణ్ సింగ్,ఈఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *