PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తహసిల్దార్ ను సన్మానించిన తెదేపా నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండల తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ సతీష్ ను మండల తెదేపా నాయకులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెదేపా మైనార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ సుభాన్, సిబిఎన్ ఆర్మీ ముళ్ళ మొయిన్ మాట్లాడుతూ గతంలో హోళగుంద మండల తాసిల్దార్ గా బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై వెళ్లిన తాసిల్దార్ సతీష్ తిరిగి హోళగుంద మండల తాసిల్దార్ గా రావడం సంతోషదాయకమని అన్నారు.అదేవిధంగా రైతుల భూ సమస్యలపై ఎప్పటికప్పుడు విచారించి,రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల నాయకులు వీరన్న గౌడ్,అబ్దుల్ రహిమన్,సలీం,జాకీర్,అల్తఫ్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *