PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మాబుసుభాని ఉరుసు మహోత్సవం

1 min read

దర్గా ను దర్శించుకున్న రఘునాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మాబుసుభాని ఉరుసు మహోత్సవం ప్రజలు కులమతాలకుఅతీతంగా మంగళవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాబుసుభాని దర్గా ను వివిద రకాల విద్యుత్ దీపాలతో, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. దర్గా దగ్గర ప్రజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.వగరూరు లో ప్రత్యేకం : – మండల పరిధిలోని వగరూరు గ్రామంలో మాబుసుభాని ఉరుసు మహోత్సవం ప్రత్యేకంగా గ్రామ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. కులమతాలకుఅతీతంగా నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మాబుసుభాని దర్గా ను టిడిపి నాయకులు మాధవరం మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట టిడిపి నాయకులు పవన్ కుమార్, వీరారెడ్డి, గోపాల్, లింగప్ప, తదితరులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *