PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచాయితీలకు పుష్కలంగా నిధులు..

1 min read

ఎమ్మెల్యే కు సర్పంచ్ రవి యాదవ్ ఘన స్వాగతం..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు విలువ పెరిగిందని అంతే కాకుండా పంచాయితీల్లో అభివృద్ధి పనులకు గాను నిధులు వేయడం జరిగిందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం నందికొట్కూరు మండల పరిధిలోని బిజినవేముల గ్రామంలో 20 లక్షల సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ రవి యాదవ్ ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని సుంకులమ్మ గుడి, సవారమ్మ గుడి,రాంపుల్లయ్య ఇంటి ముందు సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అభివృద్ధి లేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కేంద్ర ప్రభుత్వ 20 లక్షల ఉపాధి హామీ నిధులతో పనులు ప్రారంభించామని అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్ లకు నిధులు లేక పోవడం వల్ల వారికి గౌరవం ఉండేది కాదని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు నిధులు విడుదల చేయడంతో వారి గౌరవం పెరిగిందని నేను ఈ ప్రాంత వాసినే కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని రానున్న రోజుల్లో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని  ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ,తహసిల్దార్ బి శ్రీనివాసులు,ఈవోఆర్డీ రంగ నాయక్,ఉపాధి హామీ పథకం కోర్సు డైరెక్టర్ ఏసుదాసు,  ఏపీవో మంగమ్మ,పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వర్లు,రాముడు,రాఘవేంద్ర,శ్రీనివాసులు,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *