PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో అధికారులు

1 min read

ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలి

విత్తనాలు అమ్మే షాపులపై తనిఖీలు నిర్వహించాలి

పిజిఆర్ఎస్ లో వచ్చే అర్జీలు రీఓపెనింగ్, పెండెన్సీ లేకుండా చర్యలు

జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఈనెల 18వ తేదీ నుండి రీ సర్వేపై రెవిన్యూ అధికారులు గ్రామ సభలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని ఆర్డివోలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో సివిల్ సప్లయి, రెవిన్యూ అధికారులతో రేషన్ పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు రీఓపెనింగ్ పై వచ్చిన అర్జీలు, రీ సర్వే గ్రామ సభలు, తదితర అంశాలపై  సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనిప్రభుత్వ రేషన్ దుకాణాలను, ఎమ్మెల్సీపాయింట్లనుండి నాణ్యమైన నిత్యావసర సరుకులు పంపిణీ జరిగేలా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించాలని రెవిన్యూ, సివిల్ సప్లయి అధికారులను  ఆదేశించారు.  జిల్లాలోని అన్ని ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో, ఎమ్మెల్సీ పాయింట్లను, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పెట్రోల్ బంకులు, వంట గ్యాస్ గోదాములను, ధాన్యం కొనుగోలు చేసే రైస్ మిల్లులను, గోనె సంచుల పంపిణీ, సిసి కెమేరాల ఏర్పాట్లు, తదితర అంశాలపై జాయింట్ దిశా, నిర్ధేశం చేశారు.   రేషన్ కు సంబంధించిన అంశాలపై మండల పరిధిలో సమన్వయ కమిటీల ద్వారా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.  ప్రతినెలా పదో తేదీ నాటికి రేషన్ సరుకుల పంపిణీ పూర్తిచేయాలని పేర్కొన్నారు.  నెలలో ఒకసారైనా రెవిన్యూ డివిజనల్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ నివేదికను అందజేయాలని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కందిపప్పు, పంచదార సక్రమంగా పంపిణీ జరుగుతున్నదీ లేనిదీ పర్యవేక్షించాలన్నారు.    పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలకు సంబంధించిన వివరాలను సేకరించి పరిష్కరించాలన్నారు.  నాణ్యతాలోపం ఉన్న విత్తనాలు అమ్మే షాపు పై తనిఖీలు చేసి షాపు యజమానులపై చర్యలు తీసుకొని నివేదికను అందజేయాలన్నారు.  రేషన్ బియ్యం రాత్రివేళలో అక్రమంగా తరలించే వారిపై సంబంధిత అదికారులు నిఘాపెట్టి తనిఖీలు ముమ్మరం చేసి సరుకును స్వాధీనపర్చుకొని వారిపై చర్యలు తీసుకోవాలని జెసి ఆదేశించారు.  అక్రమంగా నిల్వచేసే రేషన్ బియ్యం స్పాట్ లను విఆర్ఓ ల ద్వారా గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.    ఏజెన్సీ మండలాల్లో కుల ధరఖాస్తులు పెండింగ్ ఎక్కువగా ఉన్నాయని వాటిపై రివ్యూచేసి పెండింగ్ లేకుండా చూడాలన్నారు.  బిఎన్ డిఎస్ పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  పిజిఆర్ఎస్ లో వచ్చే అర్జీలు రీఓపెనింగ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని వీటిని అధికమించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రతి బుధవారం మండల సమన్వయ కమిటీ మండలాల్లో ఏర్పాటుచేసి రీ ఓపెనింగ్ కేసులపై చర్చించుకోవాలన్నారు.  సమావేశంలో   ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం ఆర్డివోలు అచ్యుత అంబరీష్, వాణి, కె. అద్దయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హాబీబ్ భాషా, పౌర సరఫరాల జిల్లా మేనేజరు శ్రీలక్ష్మి, జిల్లాపౌర సరఫరాల అధికారి ఆర్. సత్యనారాయణ రాజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *