PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వం..

1 min read

మా కార్యకర్తలు సొంత లాభం ఆశించరు

గ్రామాల్లో ‘పల్లె పండుగ’ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గత ఐదేళ్లలో పసుపు జెండా మోసిన మా కార్యకర్తలకు నేను గానీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మా కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. బుధవారం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో ఉపాధి హామీ నుండి రోడ్లకు మంజూరైన వాటిని ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 3 లక్షల 90 వేల నిధులతో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.ముందుగా గ్రామ టిడీపీ నాయకులు బొగ్గుల దామోదర్ రెడ్డి,పుల్యాల వాసు రెడ్డి,పుల్యాల రాజశేఖర్ రెడ్డి, శేఖర్ ఎమ్మెల్యేకు మరియు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మండలంలోని “పల్లె పండుగ” కార్యక్రమంలో భాగంగా ప్రాతకోట,తూర్పు ప్రాతకోట, రైతుపల్లె గ్రామాల్లో మంజూరైన 70 లక్షల సీసీ రోడ్లకు రోడ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ పి శేషమ్మ,గ్రామ టిడీపీ నాయకులు వై వెంకటరెడ్డి,వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు,సగినేల వెంకటరమణ,జెసీబీ శంకర్ వారికి అపూర్వ స్వాగతం పలికారు.మా కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడతారు సొంత లాభం ఆశించరు గతంలో జగన్ పేదల రైతుల పొలాల పాస్ పుస్తకాలకు మరియు పొలాల నెంబరాళ్లకు తన బొమ్మలు వేసుకున్నారని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పుష్కలంగా వర్షాలు వస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త నల్లమల రవికుమార్,బిజెపి నాయకులు చల్లా దామోదర్ రెడ్డి,ఎంపీడీవో సుమిత్రమ్మ,రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, పంచాయతీరాజ్ ఏఈ జావిద్ మరియు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *