PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తలముడిపిలో ‘పల్లెపండుగ’ పనులకు భూమి పూజ

1 min read

సీఎం..డిప్యూటీ సీఎం సారధ్యంలో గ్రామాలు సస్య  శ్యామలం:శివరామిరెడ్డి

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతూ సస్య శ్యామలం అవుతాయని మిడుతూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వంగాల శివరామిరెడ్డి అన్నారు.   నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో “పల్లె పండుగ” పంచాయితీల వారోత్సవాల్లో భాగంగా శివరామిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.బుధవారం ఉదయం గ్రామంలోని మైనార్టీ కాలనీల్లో ఉపాధి హామీ పది లక్షల నిధులతో సీసీ రోడ్లకు వంగాల శివరామిరెడ్డి మరియు ఎంపీడీఓ పి దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా శివరామిరెడ్డి మాట్లాడుతూ ఏ రహదారి పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.గతంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీల అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు.ఇక నుంచి గ్రామాలు అభివృద్ధి బాట పడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ ప్రతాపరెడ్డి,ఉపాధి హామీ ఏపీవో జయంతి,గ్రామ నాయకులు రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సామన్న,విఆర్ఓ ఖాదర్ బాష, చిన్న దస్తగిరి,గోపాల్,పక్కిర్ అహ్మద్,గోవిందు,రాముడు, శేఖర్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *