PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పల్లెపండగ’తో.. గ్రామాల అభివృద్ధి..

1 min read

సీసీ రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీల ఏర్పాటు

  •  డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాన్​ చొరవతో నిధుల కేటాయింపు
  • పంచాయతీ రాజ్​ జిల్లా అధికారి గుర్రాల భాస్కర్​

కర్నూలు, పల్లెవెలుగు:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ పల్లె పండగ ’ కార్యక్రమంతో గ్రామాలకు మహర్దశ పట్టనుందని, గ్రామాల  అభివృద్ధితో కర్నూలు జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్​ జిల్లా అధికారి గుర్రాల భాస్కర్​. బుధవారం తన ఛాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించనున్న సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో, డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాన్​ ప్రత్యేక చొరవతో గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించారని, దీంతో గ్రామీణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టే అభివృద్ధి పనులు రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, వాటర్​ ట్యాంకుల నిర్మాణం తదితర పనులన్నింటికీ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా డీపీఓ జి. భాస్కర్​ కోరారు.

పారిశుద్ధ్యంపై.. ప్రత్యేక చర్యలు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా  జిల్లాలోని  ప్రతి గ్రామంలో తాగునీరు ట్యాంకుల, పైపులు లీకేజీ లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా డీపీఓ జి. భాస్కర్​ తెలియజేశారు. గ్రామీణ ప్రజలకు, పిల్లలకు అంటు వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *