సాగునీటి ప్రాజెక్టులు, సాగు భూమి కోసం భూ పోరాటాలకు సిద్ధం కండి
1 min read

మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఎర్రగుడి ఈశ్వరెడ్డి వర్ధంతి సదస్సులో సిపిఎం పిలుపు
పత్తికొండ, న్యూస్ నేడు: సాగునీటి ప్రాజెక్టుల కోసం భూ పోరాటాలకు సిద్ధం కావాలని సోమవారం పట్టణంలోని కుమ్మరి వీధిలో సిపిఎం పార్టీ కార్యాలయం ముందు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి వర్ధంతి సదస్సులో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు పత్తికొండ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన వహించగా ఈ సదస్సుకు నియోజకవర్గంలోని సిపిఎం పార్టీ సానుభూతిపరులు నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గాన్ని సిపిఎం పార్టీ పరిపాలించిందని 1967 నుండి 72 దాకా ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి పత్తికొండ నియోజకవర్గం పరిపాలించడంతోపాటు విద్యుత్ మరియు మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు గిరిజన గ్రామాలకు భూ పంపిణీ చేయడంతో పాటు సాగు తాగునీటి పై ఉద్యమం ఉదృతం చేసి ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు రైతాంగ పక్షపాతిగా రైతులకు అండగా నిలబడి పత్తికొండ ప్రాంతంలో మరిచిపోని మహనీయునుగా నిలిచారని అన్నారు. పత్తికొండ ప్రాంతం నుండే ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష పార్టీలు అధికార దుర్వినియోగం చేస్తూ వారి సొంత నియోజకవర్గం నీటిని తరలిస్తున్నారని పత్తికొండ నియోజకవర్గం హంద్రీనీవా పారుతున్న కనీసం రైతులకు వాడుకునే పరిస్థితి లేక కేవలం ఆరుగాల పంటకే రైతులు అవుతున్నారని దీన్ని పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న రైతంగం గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా హాజరై స్వర్గీయ ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి.


