PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లె పండగ తోనే పల్లెలు అభివృద్ధి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం  : మండల పరిధిలోని పల్లెలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలతోనే అని టిడిపి నాయకులు మాధవరం రఘునాథ్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మాలపల్లి, చౌలహళ్లి, సుంకేశ్వరి గ్రామాల్లో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం  అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి మన టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. అభివృద్ధికై మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్   ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నడూ చూడని నిధులను మంజూరు చేసి  మన మంత్రాలయం అలాగే పల్లెలు అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తున్నరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శోభారాణి, ఈఓఆర్డి ప్రభావతి, పంచాయతీ రాజ్ ఏఈ మల్లయ్య, ఎపిఓ తిమ్మారెడ్డి, మాలపల్లి మాజీ సర్పంచ్ చావిడి వెంకటేష్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, ఎస్ యం గోపాల్ రెడ్డి, చంద్ర, నర్సన్న ఆచారి, వీరేష్, లక్ష్మయ్య, నరసింహులు, సుంకేశ్వరి టిడిపి నాయకులు రోగప్ప, రంగడు, సచివాలయ ఉద్యోగులు, అధికారులు మూడు గ్రామాల కూటమి నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *