PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవులందరికీ భగవద్గీత పుస్తక ప్రసాదం ..ప్రతి విద్యార్థికి అందాలి

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉచితంగా అందిస్తున్న మానవులందరికీ భగవద్గీత పుస్తక ప్రసాదం ప్రతి విద్యార్థికి అందేలా పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు, ఉపాద్యాయులు, శ్రద్ధ వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి విద్యార్థికి ఉచితంగా అందించుటకై తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు లక్షల పుస్తకాలు  మన జిల్లాకు అందించినట్లు తెలిపారు. ఈ 30 పేజీల పుస్తకంలో మానవ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఎదురయ్యే సవాళ్ళను ఎలా అధిగమించాలో తెలుపుతుందని, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు. పూర్తి వివరములకు 9059802265, 9441008677 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోగలరు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *