PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

1 min read

అభివృద్ధి పనులకు భూమి పూజ

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని రాంపురం, కాచాపురం గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పల్లె పండగ కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించారు. అనంతరం రాంపురం గ్రామంలో రూ 10 లక్షల తో, కాచాపురం గ్రామంలో రూ 10 లక్షల తో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. అలాగే 52 బసాపురం గ్రామంలో వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సిసీ రోడ్ల కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాచాపురం సర్పంచ్ జయమ్మ, బాబురెడ్డి, వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, పెట్రోల్ బంకు శ్రీనివాసులు, ఎంపిడిఓ శోభారాణి, ఈఓఆర్డి ప్రభావతి, పంచాయతీ రాజ్ ఏఈ మల్లయ్య, ఏపిఓ తిమ్మారెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ వెంకటరాముడు,బసాపురం సర్పంచ్ రాఘవ రెడ్డి,  రాంపురం సర్పంచ్ ఉరుకుందమ్మ,ఖగ్గల్ సర్పంచ్ రూసమ్మ, కాంట్రాక్టర్ బంగారు బాబు, సచివాలయ ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *