PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐదేళ్లలో జరగని అభివృద్ధి మూడు నెలల్లో చేసి చూపిస్తున్నాం

1 min read

గత ప్రభుత్వం లో అరాచకం ఈ ప్రభుత్వం లో అభివృద్ధి

ఇది చంద్రబాబు ఘనత

మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  ఐదేళ్లలో జరగని అభివృద్ధి కూటమి ప్రభుత్వం మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నామని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఆదివారం  మంత్రాలయం తో పాటు మాధవరం గ్రామంలో పల్లె పండగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాధవరం మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. వీరికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. మంత్రాలయం లో రెండు,మాధవరం లో ఒకటి సీసి రోడ్ల కు భూమి పూజ చేశారు. మంత్రాలయం లో ఏర్పాటు చేసిన సభ వేదిక లో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పనికి శంకుస్థాపన చేయలేని మాజీ సీఎం జగన్ అన్నారు.   మన సీఎం చంద్రబాబు నాయుడు పుణ్య మని అభివృద్ధి అంటే తేలియని వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు. మన కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి శంకుస్థాపన  చేస్తుండటం చూసి మంత్రాలయం ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వం లో అరాచకం తప్ప అభివృద్ధి ఏమి లేదన్నారు. కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మంత్రాలయం నియోజకవర్గం లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శోభారాణి, పంచాయతీ రాజ్ ఏఈ మల్లయ్య, ఏపిఓ తిమ్మారెడ్డి, ఏపియం రాజశేఖర్, ఎస్ఐ పరమేష్ నాయక్, పంచాయతీ ఈవో నాగరాజు, మంత్రాలయం టీడీపీ నాయకులు ఎంపిటిసి సభ్యులు మేకల వెంకటేష్, వరదరాజు, అశోక్ రెడ్డి, డిసి తిమ్మప్ప, హైస్కూల్ ఛైర్మెన్ నరసింహులు, డేవిడ్, శేఖర్, రాఘు, మాలపల్లి లక్ష్మయ్య, చావిడి వెంకటేష్, ఎస్ యం గోపాల్ రెడ్డి, మాధవరం ఎంపీటీసీ ఈరన్న,చిలకలడోన తిక్కయ్య, రాఘన్న ,రామయ్య, విజయ్, మాలపల్లి లక్ష్మన్న, మంత్రాలయం మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు, మాధవరం టిడిపి నాయకులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *