PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు

1 min read

అమరవీరులకు నివాళులర్పించిన ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కెవెట్రిసెల్వి,ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఉన్నతాధికారులు

వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండుగగా పోలీస్ ఫెరైడ్ గ్రౌండ్

పాల్గొన్న జిల్లా పోలీసు యంత్రాంగం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు రేంజ్ ఐజీ  జి వి జి అశోక్ కుమార్, జిల్లా  పరిషత్  చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ,  ఏలూరు జిల్లా జడ్జి  పురుషోత్తం, జిల్లా కలెక్టర్  వెట్రిసెల్వి ,జిల్లా ఎస్పీ  కె ప్రతాప్ శివ కిషోర్ జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి,జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏ ఆర్ డిఎస్పీ శ్రీహరి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో ఏలూరు పోలీస్ పెరడు గ్రౌండ్ నందు పోలీస్ కవాతుల నిర్వహించి స్మృతి పేరెండును  పోలీసు అధికారులు నిర్వహించారు. దేశంలో నెలకొని ఉన్న ఉగ్రవాదం, తీవ్రవాదం , మతతత్త్వ శక్తులు,  అసాంఘిక శక్తుల బారి నుంచి ప్రజలను కాపాడడంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి పోలీస్ అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్   మాట్లాడుతూ  రోజు రోజుకు పోలీస్ శాఖ విధులు సవాలుగా మారుతుందని కేసులు దర్యాప్తులను ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని అలాంటి వాటిని ఎదుర్కొంటూ అవిశ్రాంతంగా పోరాడుతూ శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు ఎనలేని సేవలు చేస్తూ ప్రాణ త్యాగాలు చేస్తున్నారని అన్నారు అమరవీరుల త్యాగాలను నెమరు వేసుకుంటూ వారి ఆశయ సాధనలో పోలీస్ శాఖ ముందుకు వెళుతూ వారి సేవల స్ఫూర్తితో సేవలు కొనసాగిస్తామన్నారు.  1959 చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతం వద్ద సిఆర్పిఎఫ్ భారత జవాన్లపై చైనా మిలటరీ దళాలు మూకుమ్మడిగా దాడి చేసి పదిమంది జవాన్లను ఓర్సకోత కోశారన్నారు ఆనాటి నుండి అక్టోబర్ 21వ తేదీని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా కొనసాగితే వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నార జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి  మాట్లాడుతూ దేశ రక్షణలో సైన్యం పాత్ర ఎంతో కీలకమైందని నేడు మనం స్వేచ్ఛగాజీవించగలుగుతున్నామంటే పోలీసులు తమ విధులను సమర్ధవంతంగా శక్తివంచన లేకుండా నిర్వహించడం వల్లే జీవించగలుగుతున్నామని స్పష్టం చేశారు.  అమరులైన పోలీసు వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు వారి సేవలు ఎనలేనివని కొనియాడారు.   పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వారి సంక్షేమానికి వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు వివిధ జాతీయ బ్యాంకులు ద్వారా పోలీస్ సిబ్బందికి ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరుగుతుందన్నారు గతంలో  భీమా మొత్తాన్ని  70 లక్షలు ఉండగా నేడు కోటి రూపాయల వరకు దానిని పెంచడం జరిగిందన్నారు సాధారణ మరణం కూడా ఇన్సూరెన్స్ విభాగంలోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద అమరవీరులైన 216 మంది మరల పేర్లను జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ ఎన్.సూర్యచంద్రరావు, చదివి వినిపించారు.అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి విచారించి శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులందరూ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి అమరులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. జిల్లా పోలీస్ శాఖ నిర్మించిన అమరుల స్థూపం వద్ద జిల్లా పోలీస్ యంత్రాంగమంతా శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ ఏడాది అనారోగ్యంతో మరణించిన డి నరసింహారావు, ఎస్సై 1321 టి చంద్ర రావు, ఏ ఆర్ హెచ్ సి 1626, ఎస్ వెంకటేశ్వరరావు ఏ ఆర్ హెచ్ సి 4300టి వెంకటేశ్వరరావు, పిసి 2676,డి మధు కుమార్, పిసి2539  పోలీసు కుటుంబ సభ్యులకు జ్ఞాపకలను అధికారులు అందజేశారు.నగరంలోని వివిధ కాలేజీల విద్యార్థులతో పోలీసు అధికారులు సిబ్బంది కలిసి నగరంలో ర్యాలీ నిర్వహించి ఫైర్ స్టేషన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రి రెడ్డి అదనపు ఎస్పి ఎన్ సూర్యచంద్రరావు, ఏ ఆర్ అదన ఎస్పి ఎన్ ఎస్ ఎస్ శేఖర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ,ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు  , ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ  ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ వై.వి రమణ  ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, డి సి ఆర్ బీ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్,ఏ ఆర్ ఆర్ఐ పవన్ కుమార్  పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *