PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ నవనంది పాఠశాలకు బంగారు పథకాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ నవనంది పాఠశాల విద్యార్థులు బంగారు పథకాలు సాధించినట్లు పాఠశాల చైర్మన్ బద్దుల శ్రీధర్ మంగళవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 19,20, 21 తేదీల్లోతిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు హిమతేజ,పురంధర్ లకు బంగారు పథకాలు,కే చార్లెస్ కు రజత పథకం సాధించినట్లు ఆయన తెలిపారు.వీరు నవంబర్ లో జమ్మూ కాశ్మీర్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు వెళ్తున్నారని ఆయన తెలిపారు.విద్యార్థులను పాఠశాల చైర్మన్ బద్దల శ్రీధర్ మరియు సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి నరసప్ప,కో ఆర్డినేటర్ డి మౌలాలి,జిల్లా పిఈటి సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *