PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే కెఈ.శ్యాంబాబును సన్మానించిన విశ్వబ్రాహ్మణులు… 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకార సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు కెఈ.శ్యామ్ బాబు ను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి తరపున సన్మానించారు. స్వర్ణకారులు ఎమ్మెల్యే శ్యాంబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ, శాలువలతో సన్మానించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కే.హరికృష్ణ ఆచారి,అఖిల భారత విశ్వకర్మ పరిషత్ అధ్యక్షుడు ధనుంజయ ఆచారి లుమాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను గుర్తించి వారి యొక్క సమస్యల పైన స్పందించి స్వర్ణకారులకు,స్వర్ణకార సంఘాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నందుకు కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల విశ్వబ్రాహ్మణ కుటుంబాలను ప్రభుత్వం వెంటనే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వాళ్ల యొక్క చేతివృత్తులను కొనసాగించే విధంగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సీనియర్ నాయకులు శంకరయ్య ఆచారి,మధుఆచారి,హేమంతా చారి,బ్రహ్మయ్య ఆచారి,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *