PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది ఆలయంలో ఏం జరుగుతుంది.?. నిఘా వర్గాల సేకరణ..?

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది ఆలయంలో ఏం జరుగుతుంది.?. ఎందుకు జరుగుతుంది.? అనేదానిపై నిఘా వర్గాలు ఆరా తీసినట్లు విశ్వాసనీయ సమాచారం. ఇప్పటికే క్షేత్ర పరిధిలో పనిచేసే కొందరు ఉద్యోగులతో పాటు మరికొందరి వద్ద నుండి కూడా రహస్యంగా వివరాలు సేకరించినట్లు తెలుస్తుంది. కొందరు ఆలయ ఉద్యోగులను వివిధ అంశాలపై ప్రశ్నలు వేయగా తమకు తెలియదని సమాధానం దాటవేసినట్లు తెలిసింది. ఆలయ వర్గాల ద్వారా ఆలయ అధికారుల ఫోన్ నెంబర్లు సేకరించినట్లు సమాచారం. అధికారులతో ఏమి మాట్లాడారు ఏ విషయాలపై చర్చించారు లేదా ఆరా తీశారు అనేది బయటికి పొక్కడం లేదు. క్షేత్ర పరిధిలో ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లు మరియు ఏజెన్సీ సిబ్బంది జీతభత్యాలు ఆలస్యం తదితర అంశాలపై నిఘా వర్గాలు సమాచారాన్ని క్రోడీకరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆలయంలో పనిచేసే కొందరు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *