PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేదావతికి భారీగా వరద నీరు

1 min read

కర్ణాటక కు రాకపోకలు బంద్

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  సరిహద్దుగా ఉన్న వేదావతి నది కి భారిగా వరద నీరు చేరుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వేదావతికి చేరడంతో వేదావతి నది పొంగిపొర్లుతోంది. మార్లమడికి వద్ద వేదావతి బ్రిడ్జిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో కర్ణాటక కు రాకపోకలు బంద్ అయ్యాయి. నిత్యం వివిధ అవసరాల నిమిత్తం కర్ణాటక గ్రామాలకు, బళ్ళారి, సిరుగుప్ప పట్టణాలకు మండలవాసులు ఈ బ్రిడ్జి పైనే ప్రయాణిస్తూ ఉంటారు. అయితే భారీ వర్షాల కారణంగా వేదావతిలో నీరు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో నిత్యం ఈ మార్గం ద్వారా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *