PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

1 min read

-వై నాగేశ్వరరావు యాదవ్, తెలుగుదేశం పార్టీ బీసీ యాదవ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: డోన్ నియోజవర్గం డోన్ పట్టణం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి   తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువనేత కోట్ల రాఘవేంద్ర రెడ్డి మరియు మూడు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వంద రోజుల పాలనాలలో అవ్వ తాతలకు పెన్షన్ 4000/- పథకము, మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్లు, నూతన ఇసుక విధానం,  మద్యం పాలసీ,  దీపావళికి మహిళలకు సంవత్సరానికి మూడు  ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాజీ ముఖ్యమంత్రివర్యులు దివంగత ఎన్టీఆర్ గారు పార్టీ బలోపేతానికి క్యాడర్ బలోపేతానికి గ్రామస్థాయి నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి పార్టీని పటిష్టం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు  పరిపాలనలో బడుగు బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. టిడిపి సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ కల్పించి, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు సభ్యత నమోదు చేసుకున్న యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలియజేసి టిడిపి సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *