PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల ఆకలి తీర్చడమే అన్న క్యాంటీన్..

1 min read

భోజనం నాణ్యతగా ఉండాలి: కమిషనర్,వైస్ చైర్మన్

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పేదల ఆకలి తీర్చడం కోసమే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని నందికొట్కూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ అన్నారు.నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివా నందరెడ్డి,ఎమ్మెల్యే జయసూర్య ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్ ను కమిషనర్,వైస్-చైర్మన్నందికొట్కూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ ను బుధవారం ఉదయం మున్సిపాలిటీ కమిషనర్ బేబీ మరియు వైస్ చైర్మన్ రబ్బానీ పరిశీలించి టిఫిన్ కు వచ్చిన వారికి టిఫిన్ ను వారు వడ్డించారు. అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ వైస్ చైర్మన్ అక్కడే టిఫిన్ చేశారు.తర్వాత అక్కడ టోకెన్లు ఎంతమందికి ఇస్తున్నారు టిఫిన్ ఎంత బరువు ఉందని వాటిని తూకం వేయించారు.టిఫిన్ భోజనం నాణ్యతగా శుభ్రంగా ఉండాలని వారు వంట ఏజెన్సీ వారికి సూచించారు వీటిలో ఏ మాత్రం తేడా వస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. తర్వాత అక్కడకు వచ్చిన ప్రజలతో కమిషనర్,వైస్ చైర్మన్ మాట్లాడారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *