PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రామనపల్లి జడ్పీ హైస్కూల్ ను తనిఖీ చేసిన ఎంపీడీవో

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప : మండలంలోని రామనపల్లి జిల్లా పరిషత్ హైస్కూలు ను ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ పాఠశాల నందు మధ్యాహ్న భోజన కార్యక్రమమును పర్యవేక్షించి, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ వారితో కలసి విద్యార్థులకు భోజనమును వడ్డించడం జరిగింది, మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులతో కలసి అక్కడే ఆయన బొంచేశారు. భోజనము నాణ్యత పరిశీలించిన ఆయన భోజనము బాగుందని తెలిపారు. అలాగే విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత పై దృష్టి సారించాలని అక్కడి ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. అనంతరం ఆయన గ్రామ సచివాలయము తనిఖీ చేసి , సచివాలయ సిబ్బంది రిజిస్టరులను , హాజరు పట్టికను పరిశీలించారు. అలాగే సచివాలయ సిబ్బందికి పలు అంశాలపైన తగు సూచనలు ఇవ్వడం జరిగింది. రామనపల్లి లోని ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ కూడా సందర్శించి, రామనపల్లి గ్రామములో పరిశుభ్రత పైన ప్రత్యేక దృష్టి సాధించాలని ఆయన ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామనపల్లి సచివాలయ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం సిబ్బంది, కార్యదర్శి గురువేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *