PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భావి వైద్యులుగా రాణించండి..

1 min read

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి..

  •  మెడికల్​ విద్యార్థులకు సూచించిన జీజీహెచ్​ కార్డియాలజి ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​
  • కర్నూలు హెల్త్​ క్లబ్​లో.. కార్డియాలజి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 కర్నూలు, పల్లెవెలుగు:ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని… పక్కా ప్రణాళికతో భావి వైద్యులుగా రాణించాలని సూచించారు కర్నూలు మెడికల్​ కళాశాల ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​. స్థానిక ఏ క్యాంపులోని హెల్త్​ క్లబ్​లో శుక్రవారం డిప్లొమా కార్డియాలజి ఫైనల్​ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు  మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గెట్​ టు గేదర్​ నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ మెడికల్​ విద్యార్థులకు పలు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. లక్ష్యం దిశగా అడుగులు వేసే ప్రతి విద్యార్థి జీవితంలో సక్సెస్​ సాధిస్తారని, వైద్య వృత్తిలో రాణించాలంటే చదువుతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రత అవసరమన్నారు. గుండెకు సంబంధించిన వ్యాధులు,  వైద్యచికిత్స పై అవగాహన పెంచుకోవాలన్నారు. వైద్య వృత్తిలో రాణించి సక్సెస్​ అయిన మహానుభావులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించిన ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ …. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతి గడించిన  ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, మెడికల్​ కళాశాలకు  మరింత మంచి పేరు తీసుకురావాలని మెడికల్​ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం కేక్​ కట్​ చేసి విద్యార్థులకు పంచారు. ఆ తరువాత కార్డియాలజి విద్యార్థులు డ్యాన్స్​ చేస్తూ… ఆనందం పంచుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్​ ప్రొఫెసర్లు  డా. కిరణ్​, డా. ప్రశాంత్​, డా. బిందు, కార్డియాలజి పీజీ విద్యార్థులు,  క్యాథలాబ్​ మరియు  ఈసీజీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *