PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూర్ లో టిడీపీ సభ్యత్వ నమోదు..

1 min read

డ్రైనేజీ కల్వర్టు పనులను పరిశీలించిన మాండ్ర..ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, మాండ్ర ఉమాదేవి ప్రారంభించారు.శనివారం ఉదయం అల్లూరు గ్రామంలోని శివానందరెడ్డి స్వగృహంలో కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో టిడిపి నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని సభ్యత్వం గురించి అవగాహన కల్పిస్తూ సభ్యత్వ నమోదు వేగం చేయాలని అంతే కాకుండా రెండు సంవత్సరాలకు గాను వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం చేయాలని సభ్యత్వం చేసిన వారికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందని శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే అన్నారు.తర్వాత అల్లూరు గ్రామంలో డ్రైనేజీ మరియు కల్వర్టు నిర్మాణ పనులను శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు నాణ్యతగా ఉండాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *