రోడ్డు చిత్తడి- బురదతో బేజారు…
1 min read

బస్ట్యాండ్ నుంచి వాల్మీకి సర్కిల్ రోడ్డు
హొళగుంద సబ్ ఇన్స్ పేక్టర్ శ్రీ దిలీప్ కుమార్ గురుజాల ఆధ్వర్యంలో ఆదర్శవంత కార్యక్రమం
హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండలంలో కేవలం తమ డ్యూటీలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను భుజాన మోసిన పోలీసు శాఖహొళగుందలో స్థానిక బస్ట్యాండు నుండి వాల్మీకి సర్కిల్ వరకు చినుకులు పడిన ప్రతిసారి రోడ్డు మొత్తం బురదమయమై వాహనదారులు, విద్యార్థులు, రైతులు మరియు సమస్త ప్రజలు వాహనాలపై లేదా చివరకు కాలినడకన వెళ్ళాలన్నా బురద భయంతో పాటుగా ఎక్కడ-ఎప్పుడు-ఎలా జారి పడతామోననే గుబులుతోనే రోడ్డును దాటేవారు.కాగా ఈ సమస్యకు హొళగుంద పోలీసు శాఖ సబ్ ఇన్స్ పేక్టర్ శ్రీ దిలీప్ కుమార్ గురజాల ఆధ్వర్యంలో ట్రాక్టరు, జేసిబి సోదరులు మరియు ప్రజా నాయకుడు తోక వెంకటేష్ సౌజన్యంతో ఆదివారం నాడు స్థానిక బస్ట్యాండ్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు స్వచ్ఛంద సంకల్పంతో దాదాపు 150 ట్రిప్పులు గ్రావెల్ వేసి గుంతల పూడ్చివేత కార్యక్రమం నిర్వహించబడింది . ప్రతిరోజు మండల ప్రజల సమస్యల పరిష్కారం మరియు శాంతి భధ్రతల పరిరక్షణలలో తీరిక లేకుండా తలమునకలైన పోలీసు సిబ్బంది అలసి సొలసిపోక ఊరి విషయం మనకెందుకులే అని కాకుండా మన ఊరి సమస్య మనమెందుకు తీర్చాకూడదు అంటూ సమస్యపై స్పందించి ముందడుగు వేసిన హొళగుంద సబ్ ఇన్స్ పేక్టర్ శ్రీ దిలీప్ కుమార్ గురజాల, పోలీసు సిబ్బంది మరియు ట్రాక్టరు, జేసిబి సోదరులకు హొళగుంద మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తోక వెంకటేష్, అబ్దుల్ సుభాన్, తోక తిరుమల, ఖాదర్ బాషా, వలి బాషా, గిరి, తుంబళం సిద్దప్ప, బుడ్డన్న, ట్రాక్టరు, జేసిబి సోదరులు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని సేవలను అందించారు.


