తిమ్మాపురంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ..
1 min read

మిడుతూరు, న్యూస్ నేడు:(నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన మాదిరెడ్డి వెంకట రమణారెడ్డికి 1,16,160 రూ.లముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు. మంగళవారం ఉదయం లబ్ధిదారుని ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు.కాసేపు లబ్ధిదారునితో ఎమ్మెల్యే మాట్లాడారు.అర్హులైన వారందరికీ సీఎం సహాయ నిధి కింద వచ్చే విధంగా కృషి చేస్తానని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి,సర్వోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

