ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్
1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు : మండలంలోని ఎరువుల దుకాణాలను విజిలెన్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ బి.గీతా వాణి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మండలంలోని తిరుగు దుకాణాలను తనిఖీ చేసి ఎరువుల స్టాక్ వివరాలను డీలర్లను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారా లేదా అని వారిని అడగడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు చెరువులను విక్రయించడం జరుగుతుందని వారు తెలిపారు. అలాగే రైతు సేవ కేంద్రాలలో యూరియా పంపిణీ విధానాన్ని ఆమె పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ ఎం. కృష్ణారెడ్డి, మండల వ్యవసాయ అధికారి కె. శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

