NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

16న మిడుతూర్ మండల సర్వసభ్య సమావేశం..

1 min read

మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 16వ తేదీ మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ పి దశరథ రామయ్య బుధవారం సాయంత్రం తెలిపారు.16వ తేదీ ఉ 11 గంటలకు ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని అన్నారు. వివిధ శాఖల మండల అధికారులు ఈ నెల 15వ తేదీ లోపు తమ ప్రగతి నివేదికల ఐదు కాపీలను మండల పరిషత్ కార్యాలయంలో  అందజేయాలని అదేవిధంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు జడ్పిటీసీ,మండల కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు,సర్పంచులు తదితర ప్రజా ప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో పాల్గొనాలని ఎంపీడీవో కోరారు.

About Author