దసరా సెలవుల్లో ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
1 min read
ఉళ్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి చోరీలకు అడ్డుకట్ట వేయండి.
పోలీసులతో సహకరించి జిల్లా పోలీసుశాఖ చేసే సూచనలు పాటించాలని విజ్ఞప్తి.
జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి
కర్నూలు, న్యూస్ నేడు: దసరా సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లు, ప్రాంతాలకు వెళ్ళే జిల్లా ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.అహర్నిశలు కష్టపడి సంపాదించిన సొమ్ము, విలువైన వస్తువులు దొంగల బారిన పడకుండా ఊళ్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇళ్ళకు తాళం వేసి సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలు , విహార యాత్రలకు వెళ్లేవారు ఇళ్ళల్లో విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచి వెళ్లకూడదన్నారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో గానీ… లాకర్లు లేని ప్రజలు వాటిని తమకు బాగా తెలిసిన నమ్మకమున్న వారి ఇళ్ళల్లో లేదా బంధువుల ఇళ్ళల్లో భధ్రపరుచుకోవాలన్నారు. ఒకవేళ… విలువైన వస్తువులు బ్యాగులు/ సూట్ కేసులలో తమ వెంట తీసికెళ్లాలనుకుంటే ప్రయాణ సమయాలలో బస్సులు, రైళ్లు, ఆటోలు లేదా ఇతర వాహనాలలో వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.

