ఆలూరు పసుపు సింధూరం శ్రీమతి వైకుంఠం జ్యోతి
1 min read

టిడిపి ఇంచార్జి వర్యులు ఆలూరు_
శ్రీ వైకుంఠం శివప్రసాద్
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి- గారిరువుల సంయుక్త ఆదేశాలతో…
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి-
హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధికి చిరునామాగా నిలవనున్న శ్రీమతి వైకుంఠం జ్యోతి , టీడీపీ ఇన్చార్జి ఆలూరు మరియు శ్రీ వైకుంఠం శివప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గారిరువుల ఆదేశాలతో తెలుగుయువత మాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చిన్నహ్యట శేషగిరి, మండల కన్వీనర్ శ్రీ టి.తిప్పయ్య, కూటమి నాయకులు బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీ చిదానంద మరియు జనసేన మండల కన్వీనర్ అశోక్ తదితర నాయకుల ఆధ్వర్యంలో హొళగుంద మండల కేంద్రంలోని స్థానిక బీసీ కాలనీ, బుడుగజంగం ఏరియా, బుడబుక్కల కాలనీ’లలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.మరియు సూపర్-6 హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకై ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వివరించడం జరిగింది. దానితో పాటుగా ప్రభుత్వం ద్వారా తగ్గించినటువంటి జి.ఎస్.టి తగ్గింపు ద్వారా ప్రజల నిత్యవసర ధరలు, గృహోపకరణ వస్తువులు, వాహనాలు, తదితర వస్తువులు కూడా అతి తక్కువ ధరకే లభ్యం కానున్నాయని, ఇది కూటమి ప్రభుత్వపు ప్రజా పరిరక్షక పాలనతోనే సాధ్యమైందని కూటమి నాయకులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, డీలర్ లింగప్ప, టిడిపి నాయకులు మల్లికార్జున, హుస్సేన్ పీరా, లక్ష్మన్న, వీరేంద్ర, హనుమంతు, కోనేరు భాస్కర్, మంగయ్య, సిద్దిక్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.


