NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దళితుల ఐక్యతపై కుట్ర

1 min read

వ్యతిరేక విధానాలను మానుకోవాలి

మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్.ఎస్.రత్నాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య మంత్రులు అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను మానుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్.ఎస్. రత్నాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న  దళిత వ్యతిరేక విధానాల పై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  రత్నాకర్ మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్ రెడ్డి లు  దళితుల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విడుదల చేసిన జీఓ నెంబర్ 25ను రద్దు చేయూలని డిమాండ్ చేశారు. ఎస్సీలను వర్గీకరించే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉందని,రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. ఎస్సీలలోని, మాదిగ,మాదిగ ఉపకులాలు అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. రెల్లీలు, బుడగ జంగాలు, ఇతర కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత పై దేశవ్యాప్తoగా అతి పెద్ద రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు.  దళితులు రాజ్యాధికారం సాధించే దిశగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  కీర్తి నారాయుడు,ఈడూరి గంగరాజు,నంబూరు వరప్రసాద్,తుమ్మల ఫ్రాన్సిస్, కొప్పుల ప్రేమ్,ఉప్పు లక్ష్మీకాంత్,మత్తే బాబీ,నెల్లి సూరిబాబు,నల్లి సునీల్, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.

About Author