NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజానాట్యమండలి నాయకుడు కాశీ విశ్వనాథ్ మరణం తీరని లోటు 

1 min read

పత్తికొండ , న్యూస్ నేడు:  సామాజిక స్పృహ కలిగిన కమ్యూనిస్టు పార్టీ కీలక సభ్యుడు ప్రజానాట్యమండలి నాయకులు, న్యాయవాది కాశీ విశ్వనాథ్ అకాల మరణం సిపిఎం క తీరని లోటని సే టివి మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, సిపిఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి ప్రజానాట్మండలి జిల్లా నాయకులు పి. ఖాసిం, మండల కార్యదర్శి రమేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్థానిక ఈశ్వర్ రెడ్డి భువన్, సిపిఎం పార్టీ కార్యాలయంలోశుక్రవారం అమరవీరులు కాశీ విశ్వనాథ్ అకాల మరణానికి సంతాప సభ నిర్వహించారు. ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పి. కాసిం, మండల కార్యదర్శి రమేష్, అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రంగారెడ్డి సిఐటియు మండల కార్యదర్శి యం. రవిచంద్ర మాట్లాడుతూ, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు సిఐటియు మండల అధ్యక్షులు గా సిపిఎం పార్టీకి ఎన్నో సేవలు అందించిన కాశి విశ్వనాథ్ మరణం పార్టీకి తీరని లోటని ఆయన ఆశయాలను రాబోవు యువ కళాకారులు ప్రజానాట్యమండలి గాయకులు నెరవేర్చాలని అన్నారు. అనంతరం పి ఖాసిం రమేష్ మాట్లాడుతూ, మా మిత్రుని మరణం కలచివేసిందని ఆయన మా మధ్య లేడు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గోపాల్ డివైఎఫ్ఐ అధ్యక్షులు దూదేకుల కోడం దుగ్గెన, సిఐటియు మద్దికేర మండలం నాయకులు బురుజుల రాముడు, ఆటో కార్మిక సంఘం నాయకులు జై, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.

About Author