పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య..
1 min read
కుటుంబంలో విషాద ఛాయలు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ఉన్న ఒక్కగా నొక్క కుమారుడుని తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకున్నారు.చివరికి కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విడుదలఆత్మహత్య చేసుకున్న సంఘటన మిడుతూరు మండలంలో చోటుచేసుకుంది.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో పోగులన్న గారి నారాయణ,నారాయణమ్మ కుమారుడు వెంకటరమణ (18)ఆత్మహత్య చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వెంకటరమణ ఇంటర్ వరకు చదివి పొలం పనులు మరియు పశువులను మేపడానికి వెళ్తూ ఉండేవాడని గత 5 రోజుల క్రితం రాత్రి 12 గంటల సమయంలో పురుగుల మందు తాగి తన స్నేహితునికి ఫోన్ చేసి”నేను వెళ్ళొస్తానని”చెప్పి ఫోన్ కట్ చేశాడు.తన స్నేహితుడు బంధువులు పశువుల కల్లం దగ్గరికి వచ్చి చూడగా అప్పటికే వాంతులు చేసుకుంటూ ఉండేవాడని అప్పటికప్పుడు రాత్రి కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం ఉదయం మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు.హర్యానా ఫారం బర్రెలు కొనాలని వారం రోజుల నుండి తండ్రిని అడుగుతుండేవాడు.డబ్బులు లేవు పంట డబ్బులు వచ్చిన తర్వాత బర్రెలు కొందామని తండ్రి చెప్పాడు.తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు.మృతునికి అక్క ఉన్నారు.

