ఎస్డీపిఐ పార్టీ తరుపున మన వార్డు మన బాధ్యత ప్రారంభోత్సవ కార్యక్రమం
1 min read

హొళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలం పార్టీ కార్యాలయం నందు సమావేశంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అసెంబ్లీ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మన వార్డు మన బాద్యత అనే నినాదంతో ఇంటింటా సంక్షేమ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా హొళగుంద మండలం లో ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం ఎస్డీపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు హమీద్ మాట్లాడుతూ ఎస్డీపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమము మొదలుపెట్టారు రాష్ట్రవ్యాప్తంగా మన వార్డు మన బాధ్యత కార్యక్రమంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలలోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదాప్రజా సమస్యలు ఏవైనా ఉన్నాయా తెలుసుకొని ప్రజా సమస్యలు తీర్చడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక సైనికుల్లాగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ కార్యదర్శి హఫీజ్ కార్యవర్గ సభ్యులు మరియు బ్రాంచ్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

