NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శించుకున్న భక్తులు

1 min read

నిత్య అన్నదాన సత్రం నందు 4,2OO మందికి అన్న ప్రసాద వితరణ

 వివిధ సేవలు రూపేణ రూ:2,68, 740/-లు ఆదాయం సమకూరినది

కార్యనిర్వహణాధికారిని ఆర్.వి. చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కార్తీకమాసం ఆదివారం సందర్భముగా ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు ఉదయం గం.07.00లకు హనుమద్ హోమం అనంతరం శ్రీ సువర్చుల హోనుమద్ కళ్యాణం ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల ఆద్వర్యములో జరుపబడినది. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనినారు.ఈ రోజు మద్యాహ్నం గం.03.00 లవరకు శ్రీ స్వామి వారి ఆలయమునకు వివిధ సేవల రూపేణా రూ.2,68,740/-లు సమకూరినది. శ్రీ స్వామి వారికి స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 4200 మంది భక్తులకు అన్నదానము జరుపబడినది. ఈ రోజు రాజమహేంద్రవరం శ్రీ బాల రాజా రాజేశ్వరి కూచిపూడి నృత్యాలయం వారిచే భారత నాట్యం, కూచిపూడి కార్యక్రమం జరిగినది. స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన ఎటువంటి ఇబ్బంది కలగకుండా  తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెల్పినారు.

About Author