రెడ్ క్రాస్ బ్లడ్ అండ్ ఐ బ్యాంకును సందర్శించిన మాజీ రాజ్యసభ సభ్యులు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ నగరంలోని రెడ్ క్రాస్ సంస్థ రక్తనిధి కేంద్రాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఈరోజు సందర్శించారు. రెడ్ క్రాస్ కార్యాలయ ఆవరణంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటికే కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తలసేమియా వ్యాధి భారీన పడినవారు దాదాపు 1000 మందికి పైగా ఉన్నారు. వీరందరికీ ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ లు అలాగే రక్తమార్పిడి చేయవలసి ఉంటుంది. తలసేమియా వ్యాధికి గురైన వారు అత్యధికలు పేద, మధ్యతరగతి వర్గాల వారే. దీనితో వారు సరైన వైద్య సౌకర్యాలు లేక, సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. వీరికోసమై జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో వారి కొరకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించాలని తలచింది. అందుకు మాజీ రాజ్యసభ సభ్యులు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ బ్యాంకు ఆవరణంలోనే తలసేమియా వ్యాధి బాధితులకు భవనాన్ని ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ భవనం ఏర్పాటు అయితే తల సేమియా వ్యాధి బారిన పడినవారు వారికి అవసరమైన రక్తం పొందడంతో పాటు, మిగిలిన అన్ని రకాల పరీక్షలను కూడా ఇక్కడే పొందే అవకాశం ఉంటుందని రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో గర్భిణీ స్త్రీలకు కూడా హెచ్ఐవి తరహాలో తలసేమియా పరీక్షలు నిర్వహించి పుట్టబోయే బిడ్డలకు ఈ వ్యాధి భారీన పడకుండా కాపాడేందుకు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థకు మొదటి నుంచి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని, అలాగే ముందు ముందు కూడా కొనసాగిస్తానని చెప్పారని గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె వి సుబ్బారెడ్డి, శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బాబురాజ్, దాశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

