మానవ శరీర అంతర్గత నిర్మాణాల పనితీరు తెలిపేదే ఫిజియాలజీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: శరీర అంతర్గత నిర్మాణాలు ఆరోగ్యంగా ఉంటే రోగాలకు దూరంగా ఉన్నట్లే…. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ.. మానవ శరీరంలోని అంతర్గత నిర్మాణాల పనితీరు అవి ఆరోగ్యంగా ఉంటే మనిషి రోగాలకు దూరంగా ఉండి పనిచేయగలుగుతాడని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ అన్నారు. శుక్రవారం కర్నూల్ మెడికల్ కాలేజీ యందలి ఫిజియాలజీ విభాగం యందు ఈ నెల 17వ తేదీ నుండి 21 వరకు నిర్వహిస్తున్న ఫిజియాలజీ వారోత్సవాల ముగింపు సందర్భంగా న్యు లెక్చరర్ గ్యాలరీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ. ప్రతి వైద్య విద్యార్థి శరీర అంతర్గత భాగాల నిర్మాణం వాటి పనితీరు ప్రభావితమయ్యే అంశాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని అంటే ఫిజియాలజీ పై పట్టు సాధిస్తే అనాటమీ ఫార్మకాలజీ మైక్రోబయాలజీ పెథాలజీ మెడిసిన్ తోపాటు అన్ని క్లినికల్ విభాగాల్లో రాణించగలుగుతారని తద్వారా వైద్య విద్యలో మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. మొట్ట మొదటి ఫిజియాలజి విభాగాధిపతి ఫౌండర్ ఆఫ్ కె.యం.సి డా . వెంకట రామయ్య విగ్రహనికి పూలమాల వేసి వారి సేవలు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డా. సాయి సుధీర్ డా. విజయ్ ఆనంద్ బాబు, డా. సింధియా శుభప్రద, ఫిజియాలజీ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డా.రాధిక, డా.ఎలిజబెత్, డా.లక్ష్మి అసిస్టెంట్ ప్రొఫెసర్ లు డా. ఉమామహేశ్వరి డా. తులసి డా. సురేష్ పీజీ లు , సిబ్బంది పాల్గొన్నారు.

