మైనార్టీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి షేక్ సయ్యద్ బాజీ కి గౌరవ డాక్టరేట్
1 min readడాక్టరేట్ బిరుదు అందుకోవటంతో ప్రజాప్రతినిధులు,పలు ముస్లిం సంఘ నాయకులు మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రశంసలు
హజాoత్ మౌలాలి ముష్కుల్ కుషా (గొలుసులు పంజా) ఆస్థానంలో పలువురు సంఘ పెద్దలు సత్కారం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: హజంట్ మౌలాలి ముష్కుల్ కుషా ఆస్థానంలోపలువురు సంఘ పెద్దలు డాక్టరేట్ పట్టా పొందిన షేక్ సయ్యద్ బాజీ (గాజులబాజి)ని పలువురు ముస్లింలు, సంఘ పెద్దలు ఘనంగా సత్కరించారు. ది న్యూ లైఫ్ థియాలజికల్ ఆఫ్ యూనివర్సిటీ హైదరాబాద్ వారిచే ఫౌండర్ ఛైర్మెన్ బిషఫ్ రెవ.డాక్టర్ జోసెఫ్ పాలంగి చీఫ్ గెస్ట్ శామ్యూల్ అర్టూఉర్, తదితరులు ప్రముఖులు చేతులు మీదుగా వివిధ రంగాలలో వివిష్ట సేవలు అందించిన వారికీ యూనివర్సిటీ వారు డాక్టరెట్ బిరుదులతో సత్కరించారు, దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూరుభాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన రాష్ట్ర కమిటీ లోను మరియు జాతీయ దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ ఫోరమ్ కమిటీ ద్వారా మరియు వివిధ రంగాలలో ఎన్నో సేవలు అందించిన ఏలూరుకు చెందిన షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ )కి ” ది న్యూ లైఫ్ దియాలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ వారు, హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏలూరు గాజుల బాజీ కి, ఆయన చేసిన సేవలు గుర్తించి గౌరవ డాక్టరేట్ బిరుదు ఇచ్చి, మోడల్, సర్టిఫికెట్, మెమోంటో, శాలువాతో యూనివర్సిటీ ఛాన్సలర్, ప్రముఖులు,పెద్దలు, తదితరులు ఘనంగా సత్కరించారు, దానిలో భాగంగా శుక్రవారం ఏలూరు గొలుసులు పంజా ఆస్థానంలో పలువురు ముస్లింలు, ముస్లిం సంఘ పెద్దలు, శ్రేయోభిలాషులు బాజీని శాలువాకప్పి, పూల బొకేలు అందించి ఘనంగా సన్మానించారు.వారు మరెన్నో ఉన్నత పదవులు, గౌరవ సత్కారాలు, బిరుదులు అందుకోవాలని ఆకాంక్షించారు. షేక్ సయ్యద్ బాజీ కి డాక్టరేట్ రావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు చరవాణిల ద్వారా మరియు స్వయంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సాబీర్ హుస్సేన్ అహేలే సున్నత్ వల్ జమీత్ అధ్యక్షులు, ఎండి రసూల్ జిల్లా మసీద్ అధ్యక్షులు, ఇలియాస్ బాషా 45వ డివిజన్ కార్పొరేటర్ మరియు ఎండి అబుల్ బాయ్, రబ్బాని, ఇక్బాల్, కైరుల్లా, షేక్ సత్తార్, నున్న తదితరులు పాల్గొన్నారు.