PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక పిల్ల మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  మండల పరిధిలోని మాధవరం గ్రామ సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక పిల్ల మృతి చెందింది. జింక పిల్ల రోడ్డు దాటుతుండంగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది రోడ్డు మద్య లో పడి ఉండగా మాలపల్లి వీఆర్వో రాజు మృతి చెందిన జింక పిల్ల ను పక్కకు తీసి మాధవరం ఎస్సై కు సమాచారం అందించారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించినట్లు ఎస్సై కృష్ణ మూర్తి తెలిపారు. ఫారెస్టు అధికారులు జింక పిల్ల ను తీసుకుని వెళ్లినట్లు తెలిపారు.

About Author