PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువ పార్వతి ఆత్మహత్యపై పూర్తి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరం  పరిధిలోని రచ్చుమర్రి గ్రామ సమీపంలో ఉన్న మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లో సుంకేశ్వరి గ్రామానికి చెందిన 10వ తరగతిచదువుతున్న కురువ పార్వతి ఆత్మహత్యకు గల కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆలూరు తాలూకా మదాసి.. మదారి కురువ సంఘం కన్వీనర్ కౌడికే రాజు, ప్రధాన కార్యదర్శి పెద్దహేట్ట మల్లయ్య  డిమాండ్ చేశారు అదే విధంగా విలేకరులు సమావేశంలో వీరు మాట్లాడుతూ విధ్యార్థిని ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్యచేశారా అన్నకోణంలో అధికారులు విచారణ చేయాలన్నారు. విచారణలో దోషులుగా తేలినవారిని కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే విద్యార్థి పార్వతి కుటుంబానికి 20 లక్షలు పరిహారం ఇవ్వాలని అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాలూకా కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author