PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కడప- కర్నూల్ జాతీయ రహదారి చెన్నూరు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజాము ఒంటిగంట సమయంలో మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన భూమిరెడ్డి నారాయణరెడ్డి (38) సంవత్సరాలు అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి కనపర్తి గ్రామానికి చెందిన భూమిరెడ్డి నారాయణరెడ్డి అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో చెన్నూరు విద్యుత్ సబ్ స్టేషన్( చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం) సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడని అయితే బాడీ గుర్తు తెలియని విధంగా నుజ్జు నుజ్జు అయిందని పోలీసులు తెలిపారు, అయితే మృతుని బావ బాల గురు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిని హత్య చేసి అక్కడ పడి వేశారా, లేకపోతే యాక్సిడెంటా  అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About Author