PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ ఉద్యోగి గ్రహీతకు ఘనంగా సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి :  గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారము నంద్యాల నగరంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రమును ప్యాపిలి ఆర్ ఐ సుధాకర్ రెడ్డి  అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్యాపిలీ తాసిల్దార్ బి.భారతి ఆధ్వరంలో తమ తోటి సిబ్బంది తో ఆర్ఐ వి.సుధాకర్ రెడ్డికి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ భారతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహించి, ప్రజలకు సేవలు అందించి నప్పుడే ప్రతి ఒక్కరిని గుర్తిస్తారని, అప్పుడే మనకు ఇలాంటి ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రాలు అందుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు ఆర్ఐ సుధాకర్ రెడ్డి స్ఫూర్తితో విధులను సక్రమంగా నిర్వహించి మన ప్యాపిలి తాసిల్దార్ కార్యాలయానికి మా మండలానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మారుతి, వీఆర్వోలు హనుమన్న, మల్లికార్జున, కృష్ణమూర్తి, సోమశేఖర్ నాయుడు, నవీన్, బ్రహ్మయ్య, రామనాయుడు, శ్రీనివాసులు,కంప్యూటర్ ఆపరేటర్ మధు, రవి, అటెండర్ తదితరులు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

About Author