PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోనికి వెళ్లే ప్రధాన రహదారిని నిర్మించాలని వినతి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ కు రాజా పంపన్న గౌడ్ వినతి  మండలంలోని హెుళగుంద నుండి ధనాపురం మీదుగా ఆదోనికి వెళ్లే ప్రధాన రహదారిని నిర్మించాలని హెూళగుంద మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ్ నెల్లూరు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాలుగా అధ్వాన్న స్థితిలో ఉన్న రహదారి వెంబటి ఎన్నో నరకయాతన ప్రయాణాలు చేస్తున్నామని ప్రస్తుతం నూతన ప్రభుత్వంలోనైనా తమ గ్రామానికి మహర్దశ వచ్చే విధంగా రహదారులను నిర్మించి రాకపోకలకు సహాయ సహకారాలను అందించాలని ఆయన కోరారు. కాకుండా విజయవాడ మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్న నెల్లూరు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ కు తమ గోడును వినిపిస్తూ ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను కూడా ఆయనకు వివరిస్తూ రహదారి నిర్మాణాలను వెంటనే చేపట్టి నియోజకవర్గ ప్రజల మన్ననలను పొందాలని ఆయన ఆకాంక్షించారు.

About Author