PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైనికుడి సన్మానం… దేశానికి చేసినట్టు

1 min read

ఎమ్మిగనూరు లో ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు  : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన బండా సత్యనారాయణ ఇండియన్ ఆర్మీ లో సేవలందించి పదవి విరమణ పొంది ఎమ్మిగనూరు కు రావడంతో సోమవారం ఆయనకు ప్రిన్స్ స్వచ్చంద సేవా సమితి సభ్యులు, ఉపాధ్యాయులు,క్రీడాకారులు,మిత్రులు వారి కుటుంబ సభ్యులతో కలిసి బిఎస్ఎఫ్ జవాన్ ను ఘన స్వాగతం పలికారు. దేశం కోసం కుటుంబాన్ని వదిలి 22 సంవత్సరాల పాటు సేవాలందించి తిరిగి రావడంతో పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదికలో తెదేపా నాయకులు  రామకృష్ణనాయుడు, రంగస్వామిగౌడ్, వైసిపి నాయకులు పాల శ్రీనివాసరెడ్డి ప్రిన్స్ సేవా సమితి అధ్యక్షుడు వహాబ్, విజేత నాగరాజు, ప్రధానోపాధ్యాయుడు లచ్చప్ప, డిప్యూటీ తహశీల్దార్ విజయ్, లు కలిసి దుస్సాలువలు పూలమాలలతో జ్ఞాపిక ను అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం సోమప్ప సర్కిల్, వైఎస్ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించి బాణసంచా పేల్చి వీవర్స్ కాలనీ తన ఇంటికి చేర్చారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి వారు మాట్లాడుతూ..సైనికుడి కి సన్మానం దేశానికి చేసినట్టేనన్నారు. దేశ సరిహద్దుల్లో ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న ఆర్మీ ఉద్యోగం పూర్తి చేసి పదవి విరమణ పొందడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమార్,శ్రీధర్,వెంకటేష్,రెహ్మాన్,శ్రీనివాసులు,పెద్దఈరన్న,శ్రీరామ్,సిజి.ఈరన్న,చాంద్,ఓంకార్,కర్ణ,చంద్ర మోహన్,వీరశేఖర్,మాదన్న,అశోక్,సర్తాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author