PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీనివాసులుకు సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:   విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడే కాకుండా, వారిని సరైన మార్గంలో నడిపిస్తూ క్రమశిక్షణతో తీర్చిదిద్ది సమాజానికి ఉత్తమ పౌరులుగా అందించే గురు దేవుళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని తూర్పు హరిజనవాడ వార్డు మెంబర్ డీకాల రాంబాబు అన్నారు. గురువారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని తూర్పు హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థులు, గ్రామస్తులు కలసి ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ రాంబాబు మాట్లాడుతూ, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి .శ్రీనివాసులుకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం పట్ల గ్రామంలోని పెద్దలు, అలాగే విద్యార్థులు హర్షం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు శ్రీనివాసులు మా పాఠశాలకు వచ్చిన తర్వాత మా పిల్లలను ఆయన పిల్లలుగా భావించి విద్యాపరంగానే కాకుండా పిల్లలకు మంచి క్రమశిక్షణతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా పిల్లలను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. గతంలో కంటే మరింత మెరుగ్గా విద్యార్థులు చదువుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉంటే ఎలాంటి విద్యార్థి అయినా ఉన్నత శిఖరాలకు ఎదగడం తద్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు శ్రీనివాసులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *