PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోస్ట్ ఆఫీసుల్లో అకౌంట్..సుకన్య సమృద్ధి పథకం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ప్రజలకు అందుబాటులో ఉంటే పోస్ట్ ఆఫీసుల్లో అకౌంట్ చేసుకుంటే మీ నగదుకు భద్రత అనేది ఉంటుందని నంద్యాల జిల్లా మిడుతూరు మండల చౌటుకూరు బిపీఎం వై.యతీంద్ర సాయి అన్నారు. పోస్ట్ ఆఫీసుల్లో 500 రూ.తో సేవింగ్ ఖాతా చేసుకుంటే అకౌంట్ లో నగదు వేయుటకు మరియు తీయుటకు పరిమితి అనేది లేదని వీటికి ఎలాంటి ఎస్ఎంఎస్ చార్జీలు ఉండవని అన్నారు.అదేవిధంగా 200 రూ.ల ఆన్ లైన్ అకౌంటుతో దీనికి ఫోన్ పే లింక్ చేయవచ్చు అని ప్రతినెలా 100 రూపాయలు నుండి ఎంతైనా సరే ఆర్డి అకౌంట్ చేయవచ్చని అన్నారు.0 నుంచి 10 సం.ల లోపు ఉన్న పిల్లలకు సుకన్య పథకం ప్రజలకు వరంగా ఉందని ఒక సంవత్సరానికి నగదు కట్టవచ్చు (లేక) సంవత్సరంలో విడతలవారీగా అయినా నగదు కట్టవచ్చని ఇలా 15 సంవత్సరాలు కట్టిన తర్వాత మిగతా ఆరు సంవత్సరాలు మీరు నగదు చెల్లించనవసరం లేదు.పోస్ట్ ఆఫీస్ యాజమాన్యం కడుతుంది అంటే మొత్తం 21 సంవత్సరాల నగదు మీకు భారీ మొత్తంలో వస్తుందని బీపీఎం యతీంద్ర సాయి తెలిపారు. వీటిని గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

About Author